జీవో 51ని రద్దు చేయాలని మంత్రి సీతక్కకు వినతి..

నవతెలంగాణ – మల్హర్ రావు
51 జీవోను రద్దు చేయాలని,పెండింగ్ సమ్మె కాలంనాటి వేతనాలు చెల్లించాలని కోరుతూ గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సితక్కకు  కారోబార్,బిల్ కలెక్టర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సాదుల శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒరుగంటి రఘు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు 51 జీవో రద్దుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా,ఎవరి కేటగిరి వారికి ఇప్పించే ప్రక్రియ సైతం కొనసాగుతుందని మంత్రి  తెలిపినట్టుగా ప్రకటించారు.ఇందుకు మంత్రికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అశోక్, ములుగు జిల్లా అధ్యక్షుడు జితెంద్ర చారి,మాధవ్ స్వామి పాల్గొన్నారు.
Spread the love