బాలికల గురుకుల పాఠశాలలో వసతులు కల్పించాలని ఎమ్మేల్యేకు వినతి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణ కేంద్రం బంగారిగడ్డలో ఉన్న తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల 640 బాలికలు చదువుకుంటున్నారు. బాలికల గురుకుల పాఠశాల లో మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎస్ఎంసి కమిటీ చైర్మన్ చింతల సాయిలు శనివారం వినతి పత్రం సమర్పించారు. చింతల సాయిలు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక ఫలితాలను సాధిస్తూ చౌటుప్పల్ బాలికల పాఠశాల అనేక సమస్యలను  బాలికలు ఎదుర్కొంటున్నారన్నారు.ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని,ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని,ఉపాధ్యాయుల క్వార్టర్స్ నిర్మించాలని,గ్రౌండ్ నిర్మాణం పెంచాలని కోరుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వినతి పత్రం ద్వారా తెలిపారు.రాజగోపాల్ రెడ్డి స్పందించి వెంటనే పనులు నిర్మాణం చేపడతారని హామీ ఇచ్చారని త్వరలోనే గురుకుల పాఠశాల సందర్శిస్తానని హామీ ఇచ్చారని చింతల సాయిలు తెలిపారు.
Spread the love