నివాసపు గుడిసె దగ్ధం..

నవతెలంగాణ- రామారెడ్డి
ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మండలంలోని కన్నాపూర్ తండాకు చెందిన షేక్ యూసుఫ్ నివాసపు గుడిసె శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దగ్ధమై నిత్యవసర వస్తువులు, రూ 20000 నగదు దగ్ధమవడంతో, విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 50 కేజీల బియ్యం, రూ 3000, బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కన్నాపూర్ తండాలో మొదటి వరుసలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్, వెంకటస్వామి, పరశురాం, చింతకుంట కిషన్, నామాల రవి, జగన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love