నవతెలంగాణ వార్తకు స్పందన..

– అధికారి పత్రం కార్యాలయానికి హాజరు కాలేదు

నవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం  “నిర్మించారు.. వదిలేశారు” అనే శీర్షికతో శుక్రవారం వచ్చిన వార్తకు అధికారులు స్పందించి విఆర్ఏ లను ఇరిగేషన్ కార్యాలయానికి పంపించి శుభ్రం చేయించారు. కార్యాలయం వద్ద ఉన్న పిచ్చి మొక్కలను, కార్యాలయం లోపల ఉన్న చెత్తను శుభ్రం చేశారు. కానీ కార్యాలయానికి సంబంధిత అధికారి మాత్రం రాలేదు. అధికారి కోసం విఆర్ఏలు చాలా సేపు ఎదురు చిసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయారు.
Spread the love