పిడుగుపాటుతో ఐదుగురికి గాయాలు

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని దర్మొరా గ్రామ శివారులో వరి ధాన్యం అరబెడుతున్న రైతులకు పిడుగు పడి గాయాల పాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. దర్మొరా  గ్రామానికి చెందిన శివ, బన్నీ, నారా యణ, శంకర్, సుంకరి దర్మన్న వడ్లు ఆరబెట్టుతుండగా వారిపై పిడుగు పడింది. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివ, బన్నీ హనుమాన్ మాల ధరించారు. వారిద్దరికి బలమైన దెబ్బలు తగిలినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Spread the love