- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామం శివార్లలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును, అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్హెచ్ఓ తెలిపారు.
- Advertisement -



