నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఆడనున్నారు. ఫిట్నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంతో వన్డే సిరీస్లో ఆడనున్నారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వెటరన్ ఓపెనర్ శర్మ దీర్ఘకాలంగా వేధిస్తున్న హామ్స్ట్రింగ్ సమస్య నుండి కోలుకుంటుండగా, స్టార్ ఆల్-రౌండర్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా అతను గత సీజన్లో ఆటకు దూరమయ్యాడు.విరాట్ కోహ్లీ కండరాల నొప్పితో ఈ సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం యశస్వి జైస్వాల్ను జట్టులోకి తీసుకున్నారు.
జూన్ 13న ధర్మశాలలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్థాన్తో తలపడనుంది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుండగా, జూన్ 20న చెన్నైలో చివరి మ్యాచ్ జరగనుంది.
భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.



