- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబ్నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
- Advertisement -



