అనారోగ్యంతో ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్ రియాజ్ మృతి

నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్ ఎస్ కె రియాజ్ (45) మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మరణించిన సంఘటన అందరినీ కలిసివేసింది. రంజాన్ పండుగకు ముందు ఆర్టీసీ డ్రైవర్ రియాజ్ పండుగ ఖర్చుల నిమిత్తం డబల్ డ్యూటీ చేశాడు. గతంలో కొద్దిగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తి డబల్ డ్యూటీ చేయడంతో ఇంకా అనారోగ్యంగా మారాడు. భార్య ఆయనను ఐదు రోజుల క్రితం ఎంజీఎం హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. వైద్యం పొందుతూ రియాజ్ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు మృతి చెందాడు. ఈ సంఘటనతో కాటాపూర్, నర్సాపూర్ (పిఏ), దాని పరిసర గ్రామాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. రియాజ్ క్లాస్మేట్స్, బంధువులు, వివిధ గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు, దహన సంస్కారాలకు హాజరై కన్నీటి పర్యంతమయ్యారు. రియాజ్ పేద కుటుంబం కాబట్టి వారి కుటుంబానికి ఆర్టీసీ అధికారులు న్యాయం చేయాలని గ్రామస్తులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మైనార్టీ సంఘాల నాయకులు కోరుతున్నారు.
Spread the love