బీరెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని బీరెల్లి కాంగ్రెస్ పార్టీ లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బీరెల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి వంగరి రమేష్, బీఆర్ఎస్ పార్టీ నుండి సంఘ రాజు రమేష్, అల్లెం నరసింహారావు, గొంది లక్ష్మి నరసయ్య లకు ములుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క కండువలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ములుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క మరొకసారి గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి బహుమానంగా అందజేస్తామని తెలిపారు. బీరెల్లి దాని పరిసర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇల్లు, ఇల్లు, గడప, గడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దయ వెంకటేశ్వర్లు(కోడి), కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love