ఎంపిడిఓ నరసింహామూర్తి సేవలపై ఆర్టీఐ సభ్యులు ఘన సన్మానం

నవతెలంగాణ – మల్హర్ రావు
గత ఐదు సంవత్సరాలుగా మండలానికి ఎంపిడిఓ గుండు నరసింహమూర్తి సేవలందించి, బదిలీపై వరంగల్ కు వెళుతున్న నేపథ్యంలో మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, మండల కార్యదర్శి బండి సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికి, పూలమాల, శాలువాలతో  సన్మానించారు.ఈ సందర్భంగా కుమార్ యాదవ్ ఎంపిడిఓ ప్రజలకు,ప్రజాప్రతినిధులకు జవాబుదారితనంగా చేసిన సేవలు అభినందనీయమన్నారు.ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడం, అర్హులైన నిరుపేదలకు అందించడంలో ఆయనకు ఆయనే చాటిన్నారు. రాబోయో రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవాలందిస్తూ ఉన్నతస్తాయికి ఎదిగి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి అవినాష్, వళ్లెంకుంటఎంపిటిసి సభ్యురాలు, ఏడబ్ల్యుయు మండల అధ్యక్షురాలు ఏనుగు నాగరాని, ఆర్టీఐ సభ్యులు కేశారపు సురేందర్, ఇందారపు రంజిత్, జర్నలిస్ట్ బుర్ర సుధాకర్ పాల్గొన్నారు.
Spread the love