తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్టీఓ

– ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలోని రెగ్యులర్ పనులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలోని అన్ని సబ్జెక్టులను 100% పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ నుండి వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కలీం, మండల రెవిన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ ,జూనియర్ అసిస్టెంట్, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love