భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకో వాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్వారి పరిపాలనలో మగ్గిన మనదేశానికి ఆగస్టు 15,1947న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది.వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది.గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.కాగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు,ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు.ఎన్నోరకాల అంశాలతో చాలాకాలం పాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు.1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది.అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల,11 నెలల,18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. ఇంతవరకూ బాగానే ఉన్నా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ.. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలుచేసే పాలకులు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డదిగా నిరూపించబడుతుంది. నేటి నుంచి మనం వైరుధ్యభరిత జీవితంలోకి ప్రవేశించబోతున్నాం.
స్వాతంత్రోద్యమం ముందుకు తెచ్చిన లౌకికతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి ఉన్నత విలువలకు చెల్లుచీటీ ఇచ్చి రాజ్యాంగాన్ని హిందుత్వం ఆధారంగా నడిపించే దేశంగా మారుస్తున్నారు.1998లో బిజెపి నాయ కత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పుడు రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వెంకట్రా మయ్య కమిషన్ను నియమించింది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకిక, సోషలిస్ట్ అనే పదాలు లేకుండా 2015 రిపబ్లిక్డే నాడు ప్రభుత్వ వాణిజ్య ప్రకటన వెలువడింది. 2019లో మోడీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగంపై మరింత తీవ్రమైన దాడి జరుగుతున్నది.రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మత స్వేచ్ఛకు సంబంధించిన అధికరణ 25,మైనారిటీలకు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవడం గురించి ఉన్న అధికరణం 30 లాంటి ముఖ్యమైన వాటిని కూడా సవరించి రద్దుచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.దేశానికి అధ్యక్ష తరహా పాలన కావాలనే తన భావనను ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఏక సమయంలో పార్లమెంట్,కొన్ని అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు జరపాలనే తన ప్రతిపాదనకు మద్దతు సమీకరిం చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇకపోతే న్యాయవ్యవస్థ,ఎన్నికల కమిషన్,సీబీఐ, ఈడీ, ఆర్బీఐ మొదలైన రాజ్యాంగ అధికార వ్యవస్థలు కూడా హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా వ్యవహరి ంచాలన్న ఒత్తిడికి గురవు తున్నాయి. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ పౌర స్వేచ్ఛ.భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగంలో 19వ అధికర ణంలో వాక్,సభా సంఘ, నివాస,సంచార, వృత్తి ఎంపిక స్వేచ్ఛలు కల్పించబడ్డాయి.పౌరుల మధ్య ఎలాంటి వివక్షా చూపించ కూడదని 15వ అధికరణంలో పేర్కొన్నారు.
మనదేశంలో ఏ వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే.అందరికీ ఒకే రక్షణ ఉండాలని 14వ అధికరణంలో చెప్పారు.అయితే,మోడీ హయాంలో పెరిగిన అసహన దాడులు భావప్రకటనా స్వేచ్ఛకు ప్రధాన ప్రతి బంధకాలయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగో స్థంభంగా పేర్కొనే మీడియాపై ఉక్కుపాదం మోపింది.తనను ప్రశ్నించే వ్యక్తులపై,శక్తులపైనే కాకుండా మీడియాపైనా కుట్రపూరిత కేసులు బనాయిస్తోంది. విశ్వవిద్యాల యాల్లోనూ విద్వేష వాతావరణం వెల్లువెత్తింది.చివరికి సామాజిక మాధ్యమాల్లో తమతో విభేదించే,ప్రశ్నించే వారెవరైనా, వ్యతిరేకత తెలిపేవారైనా దేశద్రోహులుగా ముద్ర వేసి జైలులో కుక్కతోంది. దేశ పౌరులు ఏం తినాలో,ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏ సినిమా తీయాలో,ఏ చిత్రం వేయాలో నేడు సంఫ్ు పరివారం నిర్దేశిస్తోంది. అత్యాచార కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా.. నేరస్తులకు దన్నుగా నిలుస్తున్నదనడానికి మహిళా రెజ్లర్ల పోరాటం ఇందుకొక తిరుగు లేని ఉదాహరణ.గుజరాత్ అల్లర్లలో అత్యంత పాశవికంగా జరిగిన బిల్కిస్ బానో ఉదంతంలో నేరస్తులను నిస్సిగ్గుగా విడుదల చేసి,పూలదండలు వేసి మరీ ఊరేగించింది. దీనిపై ఇటీవల సుప్రీం సంచలనాత్మక తీర్పు చెప్పింది. నేరస్తులను తిరిగి జైలుకు పంపాలని ఆదేశించడం ఆహ్వానించాల్సిన విషయమే.
సంఫ్ుపరివార్ మెజారిటీవాదాన్నే ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది.నాయకుడి ప్రాతిపదికన నియంతత్వ ప్రభుత్వం ఉండాలని అది కోరుకుంటుంది. బీజేపీ విధానాలను ఏ మాత్రం విమర్శించినా వారిని జాతి వ్యతిరేకులుగా, పాకిస్తాన్,చైనా అనుకూల శక్తులు గాను ముద్రవేస్తున్నారు.భిన్నాభిప్రాయాన్ని వ్యక్తంచేసే వారిపై రాజద్రోహ నేరాన్ని మోపడం ఇప్పుడు సాధారణమై పోయింది.ఇది ఒక్క రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా నియంతృత్వానికి రంగం సిద్ధం చేస్తున్నది.బీజేపీ సమాజంలోని పేద ప్రజానీకం మూఢత్వాన్ని పెంచి మత ఘర్షణలను సృష్టిస్తుంది. ఇంత బహిరంగ పక్షపాతాన్నీ, మతతత్వ ప్రభుత్వాలను ఈ 75ఏండ్ల గణ తంత్ర భారతం గతంలో ఎప్పుడూ చూడలేదు.భారత రాజ్యాం గంలోని మౌలిక సూత్రాలకు ఇవన్నీ భిన్నం. అందుకే ఒక పథకం ప్రకారం రాజ్యాంగాన్ని నిర్వీర్యపర్చి హిందూత్వ రాజ్యాంగం తీసుకు రావడానికి పెద్ద కుట్ర జరుగుతున్నది. నరేంద్ర మోడీ నేతత్వం లోని బీజేపీ చెప్పే ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్న నినాదమే పచ్చి అబద్ధం.కాబట్టి ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ కుట్రలను తిప్పికొట్టాలి.ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, భిన్నత్వంలో ఏకత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి.
నాదేండ్ల శ్రీనివాస్
9676407140