- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు, సీపీఐ(ఎం) నేత సారంపల్లి మల్లారెడ్డి (88) మరణించారని తెలిసి సీఎం ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తుచేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
- Advertisement -



