స్కూల్ యూనిఫామ్స్ అందజేసిన నాగుల శ్రీనివాస్

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలం కోల్ ప్యాక్ సింగిల్ విండో అధ్యక్షుడు కుమారుడు నాగుల శ్రునీత్ కుమార్ (బిన్ను) జన్మదినం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలూరు నందు చదువుకుంటున్న విద్యార్థులందరికీ  ఒక జత స్కూల్ యూనిఫామ్ తన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ నాగుల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గ్రామంలోని పేద మధ్యతరగతి విద్యార్థులే ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని తన గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయంగా ఈ చిన్న సహాయం చేస్తున్నాని ఇంకా అనేక విధాలుగా రానున్న రోజులలో విద్యార్థులకు అవసరమైన కనీస సదుపాయాలను తన వంతుగా అందజేస్తానని తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ లచ్చన్న  మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను గుర్తించి ఈ విధంగా సహాయం చేయడం స్కూల్ యూనిఫామ్ అందజేయడం ఎంతో ఆనందదాయకమని విద్యార్థులు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ నాగుల శ్రీనివాస్ ని తన సేవలను అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య తన కుమారుని జన్మదినాన్ని కేక్ కట్ చేసి  ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ ని శాలువాతో ఘనంగాసన్మానించారు. పాఠశాల విద్యార్థులు దుస్తులు స్వీకరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్ తిరుపతి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లింబద్రి , గుద్దేటి అశోక్, చిన్నారెడ్డి,అరిగేలా అభిలాష్ ,రఘు వీర్ గౌడ్, Y బాలకృష్ణ, L లింబాద్రి,Y చింటు,  రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంట అశోక్,ఉపాధ్యాయులు నర్సయ్య, రాజేందర్, బాలకృష్ణ ప్రసాద్, గంగారాం జయలక్ష్మి రమాదేవి లు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

Spread the love