
పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని మండల కేంద్రంలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి చెకుముకి( ఫిబ్రవరి 9 నుండి 11 వరకు జనగాంలో నిర్వహించిన)పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు, వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి, శాస్త్రీయ ఆలోచన, పరిశీలన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, శాస్త్రవేత్తలుగా ఎదగడానికి,సైన్స్ అధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచిన 10వ తరగతి విద్యార్థి రామ్ శంకర్,9వ తరగతి విద్యార్థి సాయి రెడ్డి,8వ తరగతి విద్యార్థి యశ్వంత్ లను ప్రిన్సిపాల్ తో పాటు ఏటీపీ కృష్ణవేణి,ఉపాధ్యాయ బృందం నాగమణి,శ్రీనివాస్ రెడ్డి,వంశీకృష్ణ అంజయ్య,శేఖర్ రెడ్డి,నరసింహ,సైదులు,సంతోష్, ఆదిరెడ్డి,ఉపేందర్, శ్రీనివాస్,సుధాకర్,రాజశ్రీ,మణిత, కళ్యాణి,అలేఖ్య,షాహిన్,మహేందర్,గణేష్,రవీందర్, శ్రీనివాస్,ఉప్పలయ్య,సురేష్ లు ఘనంగా సన్మానించి,అభినందించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సతీష్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి మండల,జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించడానికి నిరంతరం కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యపుస్తకాలతో సాధ్యం కాదని,సృజనాత్మకత,ఊహాశక్తిని పెంపొందించే ఆకర్షణీయమైన,విలువైన జీవిత పాఠాలు తప్పనిసరి అని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది భావి భారత పౌరులేనని వారిలో సానుకూల దృక్పథం,దృఢసంకల్పం కల్పించి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయడంలో మాపాఠశాల ఉపాధ్యాయ బృందం కృషి వెలకట్టలేనిదని అన్నారు.