అంగరంగ వైభవంగా సీతారామస్వామి కళ్యాణం

నవతెలంగాణ – మిరు దొడ్డి 
మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తీర్థ క్షేత్ర ట్రస్ట్ కన్వీనర్ కానుగంటి శ్రీనివాస్ తెలిపారు. వందల సంవత్సరాలుగా హిందువులు ఎదురుచూస్తున్న కలను నిజం చేసిన ఘనత ప్రధాని మోడీ దేనని కొనియాడారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని ఆద్యంతం తిలకించారు. అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు. కళ్యాణ అనంతరం స్వామివారికి ఓడి బియ్యం మహిళలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో వరదాచార్యులు రాజ పున్నయ్య  శర్మగోపాల చారి రాజు పంతులు చంద్రశేఖర్ శర్మ రమేష్ శర్మతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Spread the love