చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ మరో రెండు రోజుల్లో మద్రస్ హైకోర్టు ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో సెంథిల్ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. కాగా, న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తున్నది. గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ తన మంత్రివర్గంలోనే కొనసాగించారు. అయితే ఏ శాఖను కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతప్తి వ్యక్తంచేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు.