డాక్టరేట్ పొందిన శిర్గమళ్ళ కిషోర్ .. 

– పట్టుదల ఉంటే ఏ పట్టానైనా పొందవచ్చు  ..
– విద్యార్థి దశ నుండి తమ ఎదుగుదలకు సహకరించిన అందరికీ రుణపడి ఉంటా..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన శిర్గమళ్ళ క్షేత్రయ్య భాగ్యమ్మ  కుమారుడు శిర్గమళ్ళ కిషోర్ నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో పట్టుదలతో  చదువుతూ పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగి ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర శాఖ లో “తెలంగాణ సాయుధ పోరాటం లో దళితుల పాత్ర (1946-1951)” అనే అంశం పై విశ్రాంత ఆచార్యులు కె.రామకృష్ణ  పర్యవేక్షణ లో చేసిన పరిశోధనకు గానూ ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగంలో డాక్టరేట్ ను పొందారు. కిశోర్ 1నుండి 7వ తరగతి వరకు కోరకటికల్ ప్రాథమిక పాఠశాల లో, 8నుండి 10వరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యాభ్యాసం పూర్తి చేశారు . తర్వాత హైదరాబాద్ లో ఇంటర్, డిగ్రీ చేసి ఉస్మానియా యూనివర్సిటీ లో ఎం.ఏ చరిత్ర , పీహెచ్ డీ పూర్తి చేశారు . విద్యార్థి దశనుండే తెలంగాణ ఉద్యమం లో క్రియాశీల పాత్ర పోషించడంతో పాలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. పరిశోధన సమయంలో పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల లో పాల్గొని పరిశోదన పత్రాలు సమర్పించారు. కిషోర్ డాక్టరేట్ పొందిన సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అర్జున్ రావు, చరిత్ర శాఖ ఆచార్యులు లావణ్య, ఇందిర, రమేష్, బండి శ్రీనివాస్, స్నేహితులు నాగరాజు, లష్మినారాయణ, రాజు, వెంకన్న తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు.
Spread the love