మంథని అభివృద్ధి ప్రధాత శ్రీధర్ బాబు ..

– ఒకవైపు కళాశాలలు మరొకవైపు పరిశ్రమలు
– మానేరు తీరాన పరిశ్రమల స్థాపన 
నవతెలంగాణ – రామగిరి
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులుగా  ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ..  గత అమెరికా పర్యటనలో రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి, తెలంగాణ రాష్ట్ర దశ దిశను మార్చే విధంగా అభివృద్ధి పథంలో నిలిపిన  నేటి అమెరికా పర్యటనలో రూ.700 కోట్లతో మానేరు నది ఒడ్డున  పెట్టుబడులు పెట్టించి, ఇట్టి ప్రాంత అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్న , చేస్తున్న అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు అని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. మంథని నియోజకవర్గంలో చదువుల తల్లి సరస్వతి మాతను ప్రతిబింబించే విదంగా ఒక వైపు… పారిశ్రామికవృద్ధికి దోహదం చేస్తూ పరిశ్రమల స్థాపన మరొకవైపు అన్ని విధాల అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతోటే దుద్దుల్లా కుటుంబం పనిచేస్తుందని అన్నారు.
Spread the love