శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పాల్గొన్న గడ్డం వంశీకృష్ణ

నవతెలంగాణ – రామగిరి  
రామగిరి మండల కేంద్రంలోని సెంటనరీ కాలనీ శ్రీ కోదండ రామాలయం షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు, ప్రజలంతా సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రంలోని రైతులకు లాభం చేకూరాలనీ ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ జెడ్పిటిసి గంట వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వనం రామచంద్ర రావు, మాజీ జెడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్, తులసిరాంగౌడ్, కాటం సత్యం, బండారి సదానందం, మేకల మారుతి, విజయ్, మోహన్, హరీష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love