నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల సంఘం తనకు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజులు గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల సభలో కాంగ్రెస్పై, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కేసీఆర్ వారం రోజుల గడువు కోరారు.