నేడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్

praja-ashirwada-sabha-among-the-participants-todayనవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ బీఆర్ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు భూపాలపల్లిలో బీఆర్ఎస్​ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సభా వేదికల్లో కేసీఆర్.. ప్రజలకు ఓటు హక్కును వివరిస్తున్నారు. మరోవైపు తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని గురి చేస్తూ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ నెల 25న జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

Spread the love