కవిత వ్యాఖ్యల పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు: తెలంగాణ సీఈవో 

నవతెలంగాణ హైదరాబాద్‌:

నవతెలంగాణ హైదరాబాద్:  ఎమ్మెల్సీ కవిత, కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోదరుడిపై ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు విచారణ చేపడతారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. ‘‘ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చాం. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాగా వస్తున్నారు. ఓటరు కార్డే కాకుండా ఆధార్‌, పాన్‌ తదితర 12 గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నాం. అర్బన్‌ ఏరియాల్లో పోలింగ్‌ నెమ్మదిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నాం. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తాం’’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

  • తెలంగాణ ఎన్నికల సరళిపై మీడియాతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది.
  • ఈవీఎం సమస్యలు వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము
  • రూరల్ లో పోలింగ్ శాతం బాగానే ఉంది
  • అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి
  • అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి
  • జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై డీఈవోలను రిపోర్ట్ అడిగాం
  • కవిత, రేవంత్ వ్యాఖ్యల కంప్లైంట్స్ వచ్చాయి
  • డీఈవో రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు
  • 11గంటల వరకు 20.64శాతం నమోదు అయింది
  • ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల పై కంప్లయింట్ వచ్చింది
  • కవిత వ్యాఖ్యల పై డీఈవోకు ఆదేశాలిచ్చా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది
  • హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చలర్ సెంటర్ లో ఓటు వేసిన మంచు మనోజ్, విశ్వక్ సేన్
  • ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల
Spread the love