నవతెలంగాణ – హైదరాబాద్: జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఐపీఎల్ సంచలనం ఫ్రేజర్ మెక్గుర్క్కు జట్టులో చోటు దక్కలేదు. కొందరు సీనియర్లకు జట్టులో చోటు దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో స్టీవెన్ స్మిత్ను తీసుకోలేదు. అతణ్ని పక్కనపెట్టారు. మ్యాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్నూ తప్పించారు.
జట్టు: మిచెల్ మార్ష్ (కేప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా