నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో షేర్లలో మరోసారి అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఓ దశలో 900 పాయిట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ తర్వాత కోలుకుంది. సెన్సెక్స్ 300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 21,450 స్థాయి దిగువన ముగిసింది.