చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై పోలీసులన్నీగా ఉంటుందని మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నిజామాబాద్ 5వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ల ప్రవర్తన లో మార్పు కోసం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాలు మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏసీపీ రౌడీషీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎసీపీ మాట్లాడుతూ..ఇప్పటి నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారి పేర్లు గాని, మొహాలు గాని ఎలాంటి కేసులోనైనా, గ్రూపు తగాదాలలో ఐనా ఎవరి ప్రోద్బలంతో, ప్రభలంతోనైనా, ఎవరైనా ఫోన్లు లలో చెప్పడం వలన గాని నేరాలలో పాలుపంచుకోకూడదు ఈ కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలుపంచుకుంటే చట్టం లో ఉన్న ఆక్ట్ ల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడప వలసి వస్తుందని ఎసిపి హెచ్చరించారు. కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణం మీ నేర ప్రవృత్తిని విడిచి కుటుంబ సభ్యులతో కలిసి మంచి జీవన ఉపాధి ఏర్పరచుకొని సత్ప్రవర్తనడం మెలగాలని అన్నారు.
చెడు బుద్ధితో కొంతమంది చెప్పిన మాటలు విని,నమ్మి చట్ట వ్యతిరేకమైన కార్యకాలపాలు పాల్పడితే…. జైలు పాలు అవడం తప్పదని, బిర్యానీ ప్యాకెట్లు, మందు, కొంత డబ్బు లభిస్తుందేమో కానీ అది శాశ్వతమైనది కాదు. రౌడీ షీటర్ల పై ప్రత్యేకంగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు, రాత్రి, పగలు సమయంలో మీ ఇండ్లను సందర్శించి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుందన్నారు. మీపై ఒక ప్రత్యేక టీం చేత నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం అన్నారు. కొంతమంది తమ ఫ్రెండ్స్ ను కొట్టారని, కొంతమంది మెప్పు కోసం, డబ్బుల కోసం జల్సాలకి, మత్తు పదార్థాలకు అలవాటు పడి గొడవలకు, నేరాలకు పాల్పడుతున్నారు, చట్టాన్ని చేతులకు తీసుకొంటున్నారు అది చట్టరీత్యా నేరం స్నేహితులు, ఇతరుల కోసం చట్ట వ్యతిరేకమైన కార్యాకలపాలకు పాల్పడి కేసులు నమోదు అయి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ఏదైనా సమస్య ఉన్న, అపాయం ఉన్న, ఎవరైనా దాడులకు పాల్పడిన, ఇబ్బంది కి గురి చేసిన పోలీస్ వారిని సంప్రదించాలని, డయాల్ 100 కి కాల్ చేయాలని సూచించారు. వెంటనే పోలీస్ స్పందిస్తారు అన్నారు. ఈ సందర్భంగా చాలా కాలం నుండి రౌడీషీటు ఓపెన్ అయి ఉండి గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తు లను గుర్తించి వారి యొక్క రౌడీషీట్లను తీసేసే ప్రయత్నం చేస్తామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో నిజమాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 5వ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love