
నవతెలంగాణ-గోవిందరావుపేట : అడవులలో పంట పొలాలలో అటవీ జంతువుల కొరకు కరెంటు తీగలు అమర్చి మనుషులు జంతువుల ప్రాణాలకు ప్రమాదం తలపెడితే చట్టరీత్యా కరణ కఠిన చర్యలు తప్పవని పసర పోలీస్ స్టేషన్ సిఐ జి రవీందర్ అన్నారు. బుధవారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కమలాకర్ తో కలిసి
గతంలో కరెంటు ఉచ్చులు పెట్టిన వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. కొందరు తమ పంట పొలాలకు రక్షణ నిమిత్తం మరియు మరి కొంత మంది వన్యప్రాణులను వేటాడుట కొరకు కరెంట్ తీగలు , ఉచ్చులు అమరుస్తున్నారు అని వీటి వాళ్ళ మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని , గతం లో పసర పరిధిలో ఇటువంటి ఘటనలు జరిగిన దృశ్య రైతులు పంట రక్షణ కొరకు తమ పొలాల వద్ద కరెంట్ తీగలు పెట్టకూడదు అని , దీని కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియచేసారు. ఇక మీదట ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది.