చందాలు చేసి అతక్రియలు..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మానిక్ బండారు గ్రామంలో వీరేశం(55) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి మంగళవారం చెందారు. స్థానికుల కథనం ప్రకారం కొన్ని నెలల నుంచి గ్రామానికి ఉపాధి కోసం వచ్చి సీసా కమ్మరి వృత్తి పని చేసుకుంటూ వీరేశం కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం వీరేశం మృతి చెందడంతో అంత్యక్రియలకు డబ్బులు లేక పోవడంతో గ్రామస్థులు, యువకులు ముందుకు వచ్చి తల కొత్త చందాలు చేసి అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
Spread the love