పాలిటెక్నిక్ ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన సూర్యతేజరెడ్డి

నవతెలంగాణ – తుంగతుర్తి
సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి కుంభం సూర్యతేజ రెడ్డి రాష్ట్రస్థాయిలో 194వ ర్యాంకు సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శేఖర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గతంలో సూర్యతేజ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగాంలో నిర్వహించిన సైన్స్ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తూ వివిధ పోటీ పరీక్షలలో ప్రతిభ కనపరిచేలా తీర్చిదిద్దడమే మా గురుకులం యొక్క ప్రత్యేకత అన్నారు.విద్యార్థులు భవిష్యత్తులో కష్టపడి చదివి మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన సూర్యతేజ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ మేరకు విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతున్న ఉపాధ్యాయ బృందానికి పాఠశాల ప్రిన్సిపాల్ శేఖర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Spread the love