నవతెలంగాణ-హైదరాబాద్ : స్విగ్గీ లిమిటెడ్ (NSE: SWIGGY / BSE: 544285), భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్ఫామ్, రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసే నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లేట్ నైట్ ఈట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అందుబాటు ధర, వేగం మరియు అవసరానుగుణ్యతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన లేట్ నైట్ ఈట్స్ – నానాటికి భారతదేశంలో పెరుగుతున్న సుదీర్ఘ పని వేళల్లో లేదా ప్రపంచవ్యాప్త టైమ్ జోన్లలో పనిచేస్తున్న వృత్తి నిపుణుల కోసం, రాత్రిపూట ఆహారాన్ని ఆర్డర్ చేయడాన్ని మరింత సులభతరం మరియు విశ్వసనీయంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్విగ్గీస్ లేట్ నైట్ ఈట్స్, భారతదేశంలోని అగ్రశ్రేణి 30 నగరాల్లోని 4000కు పైగా ఆఫీస్ లొకేషన్లు మరియు 30,000కు పైగా రెస్టారెంట్లలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఎంపిక చేసిన భోజనాలు, డిస్కౌంట్లు మరియు వేగవంతమైన డెలివరీని అందిస్తాయి. బర్గర్ కింగ్, డొమినోస్ పిజ్జా, మెక్డొనాల్డ్స్, KFC మరియు సబ్వే వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల నుండి ఆహారం లభిస్తుంది. వినియోగదారులు “2 AM క్లబ్“ను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇది కనీసం రాత్రి 2 గంటల వరకు పనిచేసే, ఎంపిక చేసిన రెస్టారెంట్ల సమాహారం. దీనివల్ల అదనపు పని గంటల సమయంలో కూడా ఆహారం తప్పకుండా లభిస్తుంది.
లేట్ నైట్ ఈట్స్, డెస్క్ఈట్స్ క్రింద ఆలోచనాత్మకంగా ఎంపిక చేసిన వంటకాలను ఒకచోట చేర్చుతుంది. వాటిలో వన్-హ్యాండెడ్ గ్రాబీస్ (రోల్స్, ర్యాప్స్ మొదలైనవి), హెల్తీ నిబుల్స్ (ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే, ఆలస్యంగా పనిచేసే నిపుణుల కోసం గ్రెయిన్ బౌల్స్, సలాడ్లు), సిప్-టాస్టిక్ ఫ్యూయల్ (సుదీర్ఘ రాత్రుల కోసం కాఫీ, టీ, షేక్స్ మరియు ఇతర పానీయాల ఎంపికలు), స్ట్రెస్ మంచీస్ (పని సెషన్ల మధ్యలో చిరుతిండి తినడానికి వీలుగా ఫ్రైస్, నిబుల్స్, చిన్న చిన్న బైట్స్), మరియు టీమ్వర్క్ బైట్స్ (పిజ్జాలు) వంటివి ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఉండే ఒక నిర్దిష్ట అవసరాన్ని తీర్చడానికి రూపొందించబడింది. వర్క్స్టేషన్కు అనుకూలమైన భోజనాలు, క్విక్ బైట్స్ నుండి కాఫీలు, డెజర్ట్లు మరియు పంచుకోదగిన గ్రూప్ ఆర్డర్ల వరకు, ఆలస్యంగా పనిచేసే గంటల లయకు సరిపోయే ఆహార ఎంపికలు వృత్తి నిపుణులకు అందుబాటులో ఉండేలా ఈ అనుభవం రూపొందించబడింది.
స్విగ్గీ డేటా ప్రకారం, ఈ ప్రాంతాల్లోని 25% కార్పొరేట్ ఉద్యోగులు ఆఫీసులో ఉన్నప్పుడు రాత్రి 10 గంటల తర్వాత ఫుడ్ ఆర్డర్లు ఇస్తున్నారు. భువనేశ్వర్, గోవా, కొచ్చి, లక్నో, వైజాగ్ మరియు అహ్మదాబాద్ వంటి నగరాల్లో రాత్రిపూట ఆఫీసు ఆర్డరింగ్ రెండంకెల వృద్ధిని సాధించింది. ఇది భారతదేశపు రాత్రి ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయ మెట్రో మార్కెట్లకు మించి విస్తరిస్తోందని సూచిస్తోంది.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా స్విగ్గీ ఫుడ్ స్ట్రాటజీ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ & న్యూ ఇనిషియేటివ్స్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ మాట్లాడుతూ, “ఈ రోజుల్లో, కార్యాలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నిపుణులు ప్రపంచవ్యాప్త షెడ్యూల్లతో, ఎక్కువ పని గంటలతో పనిచేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఆఫీస్ ఆర్డర్లు ఏటా పెరుగుతున్నాయని మేము గమనించాము. ఇది రాత్రిపూట పనివేళల్లో ఆహారం పాత్ర పెరుగుతోందని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా, రాత్రిపూట ఆర్డర్ చేసే ట్రెండ్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టైర్-2 నగరాల్లోని కార్పొరేట్ కేంద్రాలలో కూడా వేగంగా విస్తరిస్తోంది. ‘లేట్ నైట్ ఈట్స్‘తో, ఎంపిక చేసిన ఆహార పదార్ధాలు, వేగవంతమైన డెలివరీ మరియు వారి డబ్బుకు అధిక విలువ ద్వారా, రాత్రిపూట పనిచేసే మా వినియోగదారులకు ఫుడ్ డెలివరీ ఎలా మెరుగ్గా సేవ చేయగలదో మేము పునఃరూపకల్పన చేశాము. పని ప్రదేశాలలో దినచర్యలు నిరంతరం మారుతున్నందున, భారతదేశవ్యాప్తంగా ఉన్న నిపుణులకు రాత్రిపూట భోజనాన్ని మరింత అందుబాటులోకి, సందర్భోచితంగా మరియు ప్రతిఫలాన్ని ఇచ్చే విధంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కనిపిస్తోంది. విస్తరించిన రెస్టారెంట్ భాగస్వామ్యం, కార్యాలయ కేంద్రాలలో లోతైన కవరేజ్ మరియు భారతదేశంలోని నిరంతరం పనిచేసే ఉద్యోగుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా నిరంతర ఆవిష్కరణల ద్వారా మేము ‘లేట్ నైట్ ఈట్స్‘ను విస్తరిస్తూనే ఉంటాము.” అని అన్నారు.
బెంగుళూరు ప్రోగ్రామ్ మేనేజర్ జోడించారు: “నేను తరచుగా గ్లోబల్ టీమ్లకు సపోర్ట్ అందజేస్తూ ఆలస్యంగా పని చేస్తుంటాను, మరియు సాధారణ రాత్రి భోజన సమయాల తర్వాత మంచి ఆహార ఎంపికలను కనుగొనడం ఎల్లప్పుడూ సులభం కాదు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన అర్ధరాత్రి వంటకాలు, ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు వేగవంతమైన డెలివరీ దీనిని నిజంగా ఉపయోగకరంగా చేస్తాయి.”



