ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన తారాసింగ్

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డాక్టర్ తారా సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించి చికిత్స అందుతున్న తీరును అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బందిచే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని ఎండలు తీవ్రంగా ఉన్నందున వైద్య సిబ్బంది 24 గంటలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆస్పత్రిలో డెలివరీ కేసుల సంఖ్యను పెంచాలని తెలిపారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమాకాంత్, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, నర్సింగ్ ఆఫీసర్స్ ఉత్పత్, వెంకటమ్మ, రేణమ్మ, నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love