- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ ఈగల్ పోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో దొరికిన ముఠాల లింక్ ఆధారంగా ఒడిశా వెళ్లిన ఈగల్ ఫోర్స్ టీమ్.. బలిమెల నుంచి జయపూర్ వరకు 80 కిలోమీటర్లు వెంబడించి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుంది. వాహనంలో వివిధ ప్యాకెట్లుగా ఉన్న 500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



