పేటలో తెలంగాణ పామాయిల్ రైతుసంఘం రాష్ట్ర సదస్సు..

– హాజరు కానున్న కేంద్రకమిటీ సభ్యులు జూలకంటి..
– పామాయిల్ పై అవగాహన: కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ పామాయిల్ రైతుసంఘం రాష్ట్ర సదస్సును నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ శనివారం నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సదస్సుకు ఏఐకేఎస్ కేంద్రకమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ హాజరు అవుతారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో పామాయిల్ సాగు,యాజమాన్యం పద్దతులు పై అవగాహన ,మద్దతు ధర పై తీర్మాణం ఉంటుందని తెలిపారు. ఈ సదస్సుకు పామాయిల్ సాగు దారులు అందరూ  సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Spread the love