జనజాతరకు పదివేల మంది

– పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి
– మంత్రి క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం
– పాల్గొన్న పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన  సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు మేరకు నల్లగొండ నియోజక వర్గం నుంచి పదివేల మందితో జన జాతరకు వెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జన జాతర కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నల్గొండ నుంచి తుక్కుగూడకు కార్యకర్తల వాహనాలు బయలుదేరుతాయని తెలిపారు.
పార్టీ శ్రేణులంతా జన జాతర బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. వేసవిలో మండే ఎండలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హాజరయ్యే కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్ది సుమన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాడుగులపల్లి జెడ్పిటిసి సైదులు, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు,ఎంపీటీసీలు,మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
Spread the love