ఏటీఎం లోకి వెళ్లి వచ్చేలోగా బైక్ చోరీ

నవతెలంగాణ – భిక్కనూర్
ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకొని బయటికి వచ్చేలోగా ద్విచక్ర వాహనం చోరీ జరిగిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంతంపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పట్టణ కేంద్రంలో ఉన్న ఏటీఎం సెంటర్ లోకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకొని వచ్చేలోగా ఏటీఎం బయట ఉంచిన ద్విచక్ర వాహనం దొంగలించబడింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు.

Spread the love