అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

– చండూరు జెడ్పిటిసి  కర్నాటి వెంకటేశం  
నవతెలంగాణ- చండూరు 
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని జడ్పీటీసీ కర్నాటి వెంకటేషo ఆరోపించారు. శనివారం గట్టుపల్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి క్యామా మల్లేష్ గెలుపే లక్ష్యంగా  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తైది కేసీఆరే అని, తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని తెలిపారు. ఈ కార్య క్రమంలో  ఎంపీపీ  అవ్వారి గీత  శ్రీనివాస్, ఎంపీటీసీ  చెరిపల్లి భాస్కర్, పున్నా కిషోర్, కర్నాటి అబ్బయ్య,జూలూరి పురుషోత్తం, మోదుగు శంకర్ రెడ్డి, కర్నాటి వెంకటేశం, జలాలుద్దీన్,పెదగాని శ్రీను, నారాణి జగన్, గజవెల్లి లక్ష్మయ్య, నేలంటి వెంకటేశం, పున్నా ఆనంద్, గుత్తి సంతోష్, పున్న చంద్ర శేఖర్, పెదగాని, శ్రీను, ఒర్సు శ్రీను, నేలంటి రాజు, నగేష్ , స్వామి  తదితరులు పాల్గొన్నారు.
Spread the love