– అక్కడికక్కడే మృతి
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
పొట్టకూటి కోసం సొంతూరును వదిలి వచ్చి భవన నిర్మాణ పని చేస్తున్న కార్మికున్ని నిద్రలోనే లారీ పొట్టనపెట్టుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఆవరణలో పడుకున్న కార్మికుని పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్కు చెందిన హరేరామ్ భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనం ఆవరణలోనే నిద్రించాడు. ఆ సమయంలో అతనిపై నుంచి రెడీమిక్స్ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.