– నేడు రెండు ఎలిమినేటర్ మ్యాచులు
– ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్
హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. టైటిల్ వేటలో చివరకు ఆరు జట్లు నిలువగా.. నేడు రెండు జట్లు నిష్క్రమించనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్లు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. టాప్-6లో నిలిచిన ఇతర నాలుగు జట్లు మరో రెండు సెమీస్ బెర్త్ల కోసం నేడు ఎలిమినేటర్ పోరులో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఎలిమినేటర్ 1 మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ తలపడనుండగా.. ఎలిమినేటర్2 మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్లు పోటీపడుతున్నాయి. ఎలిమినేటర్లో నెగ్గిన జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం ప్రో కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్కు వేదికగా నిలువనుంది. నేడు రాత్రి 8 గంటలకు తొలి ఎలిమినేటర్ మ్యాచ్ ఆరంభం కానుంది.