ఏపీలో కూటమి విజయం.. అశ్వారావుపేటలో సంబరాలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించటంతో మంగళవారం తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో టిడిపి,జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలిలో  కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.బాణాసంచా కాల్చి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కట్రం స్వామి దొర, జనసేన అభ్యర్థిని మూయబోయిన ఉమాదేవి,జనసేన నియోజకవర్గ ఇన్చార్జి డేగల రామచంద్రరావు,తెదేపా నాయకులు నార్లపాటి శ్రీను, వినోద్, గోపి, బావి తదితరులు పాల్గొన్నారు.
Spread the love