అల్లూరి సీతారామరాజు వేషధారణలో తొట్ల రిషి గౌడ్

నవతెలంగాణ – తుంగతుర్తి
గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో కనిపించారు. తొట్ల సుధాకర్ మంజుల దంపతుల కుమారుడు తొట్ల రిషి గౌడ్ అల్లూరి సీతారామరాజు వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా రిషి గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో మన్యం వీరుడు, విప్లవజ్యోతి, అల్లూరి సీతారామరాజు చూపించిన ధైర్యసహసాలు, ప్రాణత్యాగం భావితరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి, దాని కొరకే 27 సంవత్సరాలకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అన్నారు.
Spread the love