పాలకుర్తి ఎమ్మెల్యేను కలిసిన తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నవతెలంగాణ-తిరుమలగిరి : పాలకుర్తి ఎమ్మెల్యేను కలిసిన తిరుమలగిరి మండల కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకముగా కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమలగిరి మాజీ వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మి లాల్ నాయక్, తిరుమణి యాదగిరి, కౌన్సిలర్ భాస్కర్ నాయక్, తదితరులు కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం నూతన సంవత్సరంలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని వారు కోరారు, గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచక పాలనకు స్వస్తి పలికి ప్రజలు ప్రజాపాలనకు పట్టం కట్టారని వారన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో త్వరలో నిర్మాణం కానున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కిస్టు నాయక్, హీరు నాయక్ విజయ్ నాయక్ యాదగిరి మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love