- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు ఐపీఎల్ లో కోల్కతా వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. కేకేఆర్ ఓడితే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో 4 గెలిచి, 6 ఓడగా, ఒకటి రద్దయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 3 మ్యాచ్లలోనూ తప్పక గెలవాలి. అలాగే ఇతర జట్ల ఫలితాలపై కూడా కేకేఆర్ ఆధారపడాల్సి ఉంటుంది.
- Advertisement -



