హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు..

నవతెలంగాణ – హైదరాబాద్‌: బక్రీద్‌  సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాత నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మీరాలం ట్యాంక్‌ ఈద్గా ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

 

Spread the love