- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శివనగర్లో వినాయక నిమజ్జన శోభాయాత్రలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో ఐదేళ్ల చిన్నారి వర్షిత మృతి చెందింది. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
- Advertisement -



