పిడుగుపాటుకు గురైన ఆదివాసి రైతు.. తీవ్ర గాయాలు

– హాస్పిటల్ కు తరలింపు
నవతెలంగాణ – తాడ్వాయి
వ్యవసాయ క్షేత్రంలో పిడుగుపాటు గురై ఆదివాసి రైతు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని నర్సాపూర్ (పిఏ) గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు బంధువుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ (పిఏ) గ్రామానికి చెందిన నాలి సాంబయ్య అనే రైతు పత్తి దంటు నరకడానికి చేను కాడికి భార్య భర్తలు ఇద్దరూ వెళ్ళారు. పత్తి దంటు నరుకుతుండగా సుమారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఉరుముల మెరుపులతో వర్షం ప్రారంభమైంది. పత్తి దంటు నరుకుతుండగా ప్రమాదవశాత్తు పిడుగు పడి రైతు తీవ్ర గాయాల పాలయ్యాడు. భార్య సుజాత దగ్గర పరిసరాల్లో ఉండడంతో వచ్చి ఆయనకు సి పి ఆర్ చేసి కొద్దిగా స్పృహ రాగానే ఫోన్ చేయగా గ్రామస్తుల సహకారంతో తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Spread the love