అక్షర యోధునికి నివాళులు..

నవతెలంగాణ – ఆర్మూర్

పత్రికా రంగంలో కొత్త పుంతలు తొక్కించి, తనదైన ముద్ర వేసిన అక్షర యోధుడు, రామోజీ గ్రూప్ సంస్థలు, ఈనాడు పత్రిక చైర్మన్ రామోజీరావుకు శనివారం పట్టణంలో జర్నలిస్టులో అశ్రునివాళ్లు అర్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా పత్రిక రంగంలో ఆయన చేస్తున్న సేవలకు కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ గతంలోనే ప్రధానం చేసిన సంగతి తెలిసిందే. ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్ తో అందరికీ సుపరిచితులైన వ్యక్తి, విలువలతో కూడిన జర్నలిజం చేశారన్నారు. ప్రతి తెలుగు వాడి నాడీ పట్టుకుని ఉషోదయపు వెలుగులు పంచాలని ఆయన చేసిన కృషి నిర్విరామమని జర్నలిస్టులు కొనియాడారు. పత్రికా రంగంలో ఆయన అవలంబించిన విధానాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ జర్నలిస్టులు నెమలి ప్రశాంత్, పుట్టి మురళీ, కలిగోట చిన్న, మనోహర్, సంజీవ్, సందీప్, క్రాంతి, దినేష్,వినోద్, చేతన్, రాకేష్, రితీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love