రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి..

– మండల కార్యదర్శి ర్యాకలశ్రీశైలం 
నవతెలంగాణ – బొమ్మలరామారం 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి రైతుల ను ఆదుకొని ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ  మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం  శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రుణమాఫీ పేరిట కాలయాపన సరైంది కాదని, ఎన్నికల సందర్భంగా రైతులకు రుణాలు ఎవరు చెల్లించవద్దని ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని వారు తెలిపారు. ఇంతవరకు రుణమాఫీ ఫై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు గ్రామాలలో రైతులను రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ఒక పక్క వర్షాలు లేక, పంటలు పండక, వేలాది రూపాయలు పెట్టి సాగు చేస్తున్న పంటలు కూడా నీరు లేక ఎండిపోతున్న తరుణంలో బ్యాంక్ అధికారులు వచ్చి రుణాలు చెల్లించాలని నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు.గ్రామాలలో రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని, సహకార సంఘాలలో రైతులు తీసుకున్న అప్పులు చెల్లించాలని. వడ్డీలు వసూలు చేసి  సిబ్బంది జీతాలు తీసుకోవాలని జిల్లా బ్యాంక్  ఉన్నతఅధికారులు ఒత్తిడి చేయడంతో మండలో   కిందిస్థాయి సిబ్బంది గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు.బ్యాంక్ అధికారుల ఒత్తిడీలను అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేసి రైతులను ఆదుకోవాలని, లేకుంటే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏలూరి నరసింహ, పోచమ్మ ,నాగమణి, పోశయ్య, నరసమ్మ, గోపి, లక్ష్మి, వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love