– అల్వాల్ మున్సిపల్ ఉప కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-అల్వాల్
అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవన నిర్మాణా లను కూల్చివేస్తామని, ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అల్వాల్ మున్సిపల్ ఉప కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం అల్వాల్ మున్సిపల్ సర్కిల్ మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధి ఓం శ్రీ సాయి నగర్ కాలనీ లయోలా కాలేజీ ప్రధాన రోడ్డులో ఇంటి నెంబర్1-5-908, కుమ్మరి బస్తీ ఎదురు గా, స్టిల్ట్ ప్లస్ 2 అనుమతి పొంది, పై అంతస్తులపై అనధి కారిక 3వ అంతస్తు, పెంట్ హౌస్ నిర్మించడంతో సం బంధిత టౌన్ ప్లానింగ్ మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. మధ్యవర్తులు, దళారులను నమ్మి, వారి ద్వారా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకొని తొలగిస్తామని హెచ్చరించారు.