వేములవాడ పట్టణ శివారులోని మల్లారం రోడ్డు మూల వాగులో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని ఉదయం స్థానికులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35నుండి 40 సంవత్సారల మధ్యలో ఉంటుంది, మృతదేహం పై బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్ చేతికి వాచ్, షూ వేసుకొని ఉన్నారు. వ్యక్తి శవం మల్లారం రోడ్డులో ఉన్న ఇసుక రీచ్ లో కనుగొనబడినది, స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పట్టణ సిఐ వరప్రసాద్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు, పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీ తరలించినట్లు పోలీసులు తెలిపారు, మృతు డిని గుర్తించినవారు వేములవాడ పోలీసులకు సెల్ నెం, 8712656413 సమాచారం అందించాలని కోరారు.